నటసింహం బాలయ్య, – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తోందని, పైగా రాజకీయ నాయకురాలి పాత్రలో ఆమె కనిపిస్తారని ఆ వార్త సారాంశం.
గతంలో బాలయ్య, – విజయశాంతి కలయికలో ఎన్నో సూపర్ హిట్స్ వచ్చాయి. పైగా కల్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాలో విజయశాంతి నటించి అలరించారు. ఈ నేపథ్యంలో విజయశాంతి ‘అఖండ 2’ లో నటిస్తున్నారనగానే ప్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
అయితే ఈ విషయమై రీసెంట్ గా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రెస్ మీట్ లో విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. తను అఖండ2 చేస్తున్న విషయం తనకే తెలియదని అన్నారు. ఇప్పుడే ఈ న్యూస్ గురించి విన్నానని, తను ఆ సినిమాలో నటించటం లేదని, ఇప్పటిదాకా ఆ టీమ్ సభ్యులు ఎవరూ తనను సంప్రదించలేదని తేల్చారు. అసలు ఈ న్యూస్ ఎలా పుట్టిందో ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
అఖండ2 సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను, – బాలయ్య కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.